Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెంపుల్ సిటీలో కొత్త కల్చర్‌.. బైక్‌ రేసులతో యువత జోరు... ప్రాణాలు హరి

ఆధ్మాత్మిక నగరంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కుర్రకారుల్లో జోష్‌ కనిపిస్తోంది. రోడ్డుపైకి ఎక్కారంటే రయ్‌మంటూ దూసుకువెళ్ళాలని తెగ ఆరాటపడిపోతున్నారు. ఇంతకాలం హైదరాబాద్‌, విశాఖ వంటి మహానగరాలకే పరిమ

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (16:17 IST)
ఆధ్మాత్మిక నగరంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కుర్రకారుల్లో జోష్‌ కనిపిస్తోంది. రోడ్డుపైకి ఎక్కారంటే రయ్‌మంటూ దూసుకువెళ్ళాలని తెగ  ఆరాటపడిపోతున్నారు. ఇంతకాలం హైదరాబాద్‌, విశాఖ వంటి మహానగరాలకే పరిమితమైన బైక్‌ రేసులు ఇప్పుడు తిరుపతిలో జోరుగా సాగుతున్నాయి. స్టార్టింగ్‌లోనే ఈ రేంజ్‌లో ఉందంటే ఈ వ్యవహారం కొంతకాలం నడిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న భయం నెలకొంది తిరుపతి వాసుల్లో..
 
బైక్‌ రేసింగ్‌లు కొత్త కాకపోయినప్పటికీ తిరుపతికి మాత్రం అది కొత్తే. ఇంతవరకు ఎన్నో పాశ్చాత్య సంస్కృతులను తనలో కలుపుకున్న తిరుపతి ఇప్పటివరకు రేసింగ్‌ల సంస్కృతి వద్దకు వెళ్ళలేదు. అయితే తాజాగా తిరుపతి కుర్రకారు జోరుగా రేసింగ్‌లు ఆడుతున్నారు. వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలతో కూడా రేస్‌ ఆడుకుంటున్నారు. అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా బైక్‌ రేసింగ్‌లను నిర్వహిస్తూ మధ్యలో వచ్చే జనాల ప్రాణాలను తీస్తున్నారు. 
 
తాజాగా తిరుపతి ఎస్వీనగర్‌కు చెందిన షర్మిళ అనే మహిళ బైక్‌ రేసింగ్‌ బారిన పడింది. అర్థరాత్రి టీ షాపులో పని ముగించుకుని షాపులో మిగిలిపోయిన చెత్తను చెత్తబుట్టలో వేయడానికి వెళుతుండగా అప్పటికీ బైక్‌ రేసింగ్‌లో జోరుగా ఉన్న ఒక యువకుడు ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో తిరుపతిలో బైక్‌ రేసింగ్‌లు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం బట్టబయలైంది. 
 
రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌లు నిర్వహిస్తే ఇలాంటి బైక్‌ రేసులను ఈజీగా గుర్తించవచ్చు. కానీ కొంతకాలంగా తిరుపతి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించడం లేదు. దీంతో అర్థరాత్రి తిరుపతి యువకులు ఇష్టానుసారంగా ఈ రేసులకు పాల్పడుతున్నారు. వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా ఎదుటివారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని తిరుపతి వాసులు కోరుతున్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments