Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ టూర్ ఎఫెక్ట్ - మాజీ సీఎం జగన్‌కు సర్కారు షాక్!

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (12:15 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటూ సర్కారు ఉత్తర్వాలు జారీచేసింది. 
 
ఇటీవల వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ ఆస్తుల వివాదం కోర్టుకు చేరింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు జగన్ తాలూకు మాచవరంలోని సరస్వతి పవర్ అసైన్డ్ భూములను పరిశీలించారు. ఈ సంస్థకు చెందిన భూములపై ఆరా తీయాల్సిందిగా అధికారులన ఆయన ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఎంఆర్వో క్షమారాణి, వీఆర్వో అఖిల్, ఆర్ఐ కోటేశ్వర రావు, సర్వేయర్ సాల్మన్ రాజు, దాచేపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె.విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, మనోజ్, సరస్వతి సిమెంట్, పవర్ భూములను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments