ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి మరోమారు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 30 మంది మంత్రులతో మోడీ సర్కారు కొలువుదీరనుంది. ఈ మంత్రివర్గంలో ఏపీ నుంచి టీడీపీ తరపున ఇద్దరికి కేంద్ర మంత్రులుగా నియమితులుకానున్నారు. ఇపుడు మరో మంత్రి పదవిని కూడా రాష్ట్రానికి కట్టబెట్టనున్నారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.
శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్నారు. 1988లో ఆ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. ఇన్ఛార్జి ఛైర్మన్గానూ సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది. కాగా, ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే.