Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలైంది, అలిపిరి మెట్లెక్కి వెళ్తా: డిప్యూటీ సీఎం పవన్

ఐవీఆర్
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (11:18 IST)
తిరుమల క్షేత్రంలో కొలువైవున్న తిరుమలేశుడి మహాప్రసాదం లడ్డూ అపవిత్రంపై మాట్లాడితే కొందరికి నవ్వులాటగా వుందని ఆగ్రహం వ్యక్తం చేసారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇలాంటివే ఏ మసీదుకో, చర్చికో జరిగితే మీరు వూరుకుంటారా... రోడ్లపైకి వచ్చి గోల చేయరా అని ప్రశ్నించారు.
 
ఆయన మాట్లాడుతూ... ''హిందువుల అంటే అంత చులకనా... జగన్-భూమన కరుణాకర్ రెడ్డి ఏ మతానికి చెందినవారో నాకు తెలియదు. కానీ శ్రీవారి లడ్డూ విషయంలో వారు చేసినది చాలా ఘోరమైన తప్పు. భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలైంది. లడ్డూ కల్తీపై భూమనతో పాటు వైవి సుబ్బారెడ్డి ఇద్దరూ విచారణకు హాజరు కావాలి. ధర్మారెడ్డి ఎటు వెళ్లారు... ఆయన హిందువైతే.. బిడ్డ చనిపోయిన 11 రోజుల లోపుగానే గుడికి వచ్చేస్తారా.
 
సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోబోము. వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టిన మేము, మీరు ఏం చేస్తున్నా చూస్తూ కూర్చుంటామని అనుకుంటున్నారా. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఈ విషయం తమాషాగా వుందా. సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారంటే నాకు ఎంతో గౌరవం. ఆయన కూడా సరిగా మాట్లాడాలి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments