ఫేక్ ప్రచారం.. వైకాపా నేత భూమనకు పోలీసుల నోటీసు

ఠాగూర్
బుధవారం, 17 సెప్టెంబరు 2025 (18:58 IST)
తితిదే మాజీ చైర్మన్, వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి అలిపిరి పోలీసులు నోటీసులు పంపిచారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ రెండు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు, షేర్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులోభాగంగా, ఆయనకు అలిపిరి పోలీసులు 41ఏ కింద నోటీసులు పంపించారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాను కొన్ని రోజుల పాటు వ్యక్తిగత పనుల కారణంగా బిజీగా ఉంటానని ఆ నోటీసులు ఇచ్చిన పోలీసులకు భూమన తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్ఐ అజిత ... వీలు చూసుకుని విచారణకు రావాలని సూచించారు. అనంతరం వచ్చే మంగళవారం అంటే ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరువుతానని భూమన పోలీసులకు స్పష్టం చేసినట్టు సమాచారం. 
 
కొన్ని రోజుల క్రితం అలిపిరి సమీపంలోని ఒక విగ్రహం విషయంలో భూమన చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై తితిదే డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి, తాజాగా నోటీసులు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments