Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశ

Webdunia
బుధవారం, 10 మే 2017 (22:12 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం లభించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
 
బిజెపి సీనియర్ నేత, పట్టణాభివృద్థి శాఖామంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు భాను ప్రకాష్‌ రెడ్డి. బిజెపి అధికారంలో లేకున్నప్పుడు కూడా వెంకయ్యతో భాను సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఆ సఖ్యతే చివరకు ఆయన్ను టిటిడి పాలకమండలి సభ్యులను చేసింది. రెండు సంవత్సరాలు పాటు సభ్యులుగా ఉన్న భాను తిరిగి ఆ పదవి కోసం వెంకయ్యకు అర్జీ పెట్టుకున్నారట. దీంతో వెంకయ్య అయిపోయిందే అంటూ భరోసా ఇచ్చారట. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెంకయ్య మాట్లాడి భానుకు పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు భాను ప్రకాష్‌ రెడ్డికి టిటిడి పాలకమండలిలో మరోసారి అవకాశం రానుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments