Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైటెక్ దోపిడీ.. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి..

Robbery
Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:14 IST)
దోపిడీ దొంగలు రూటు మార్చారు, ఎప్పుడూ ఒకే విధంగా దొంగతనాలు చేసి విసిగిపోయి కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లున్నారు. ఇప్పుడు రోడ్డు పక్కన అందమైన అమ్మాయిలను ఎరగా వేసి దోపిడీలు చేస్తున్నారు. వాహనదారులను టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగలు ఈ ఉపాయాన్ని ఆలోచించారు.
 
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడలో రాత్రి వేళల్లో దోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. రోడ్డు పక్కన ఒక మహిళను నిలబెట్టి అటుగా వచ్చే వాహనాన్ని లిఫ్ట్ అడిగినట్లు నటిస్తారు. పొరపాటున ఎవరైనా బండి ఆపితే అయిపోయినట్లే, ఆ చుట్టుపక్కల కాపు కాసి ఉన్న దొంగలు ఒక్కసారిగా వాహనదారుల మీద దాడి చేస్తారు. ఆ తర్వాత వారి వద్ద ఎంత ఉంటే అంతా దోచుకుంటారు. ఒకవేళ వారికి ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికైనా వెనుకాడటం లేదు.
 
తాజాగా ఒక లారీని ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్‌ని చితకబాది వారి వద్ద ఉన్న 10 వేలు లాక్కొని వెంటనే అటుగా వస్తున్న మరో కారును ఆపే ప్రయత్నం చేయగా కారు నడిపే వ్యక్తి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దోపిడీ చాలా కాలంగా జరుగుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments