Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషపై ఆ ముద్ర వేస్తున్నారు.. తేజస్విని కేసు పెడితే ఎందుకు వదిలేస్తున్నారు?

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లోని ఆర్జీఏ స్టూడియోలో ప్రాణాలు కోల్పోయిన బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు చెప్తున్న విషయంలో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు పైర్ అవుతున్నారు. పోలీసులు చెప్పే విషయంలో వాస్తవం

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (14:50 IST)
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లోని ఆర్జీఏ స్టూడియోలో ప్రాణాలు కోల్పోయిన బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు చెప్తున్న విషయంలో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు పైర్ అవుతున్నారు. పోలీసులు చెప్పే విషయంలో వాస్తవం లేదని.. ఉద్యోగం చేసుకునే ఆడపిల్లలపై వ్యభిచారి ముద్ర వేస్తున్నారని.. ఉద్యోగం చేసుకోవడమే తమ కుమార్తె చేసిన నేరమా? అంటూ శిరీష తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన కుమార్తె విషయంలో న్యాయం కోసం మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు. పోలీసులు న్యాయం చేయాలని బాధితులు వారిని ఆశ్రయిస్తే.. అలాంటి పోలీసులే అత్యాచారయత్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసులో తేజస్విని గురించి ఎవరూ మాట్లాడడం లేదని, కేసులో ప్రధాన భాగం ఆమేనని తెలిపారు. కేసు పెట్టింది ఆమే కాబట్టి.. ఆమె పాత్ర వివరాలేంటో బయటకు రావాలని డిమాండ్ చేశారు.
 
కాగా బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యేనని.. సైంటిఫిక్ ఆధారాలతో ఆమెది ఆత్మహత్యగానే నిర్ధారించినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఏళ్ల పాటు ఎస్సైగా పని చేసి, ఎన్నో కేసులు చూసిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేల్చేశారు. ఈ కేసులో రాజీవ్‌‌ కీలక సూత్రధారి అయితే అతడిని నిందితుల్లో ఏ2గా చేర్చగా, ఏ1గా శ్రావణ్‌ను నిర్ధారించారు. 
 
రాజీవే శిరీషతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అతడిని నమ్మి ఎస్సై వద్దకు ఆమె వెళ్ళిందని.. ఆపై రాజీవే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమెను ఫ్యాన్ నుంచి కిందికి దించినట్లు తెలిపాడు. అయితే ఇతడిని ఏ2గా నిర్ధారించడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments