Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాలి

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:15 IST)
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబుతోన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం రాష్ట్రంలో కొత్త‌గా 13 జిల్లాలు ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.
 
హామీ ఇచ్చిన విధంగా ప్ర‌తీ పార్ల‌మెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. అనంత‌పురం జిల్లాలో హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింది. వ్యాపార‌ప‌రంగా, వాణిజ్య‌ప‌రంగా, పారిశ్రామికంగా అన్ని ర‌కాలుగా ఎంతో అభివృద్ధి చెందిన విష‌యం అంద‌రికీ తెలిసిందేనని బాలయ్య చెప్పుకొచ్చారు.
 
హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కోరారు బాల‌య్య‌. హిందూపురం ప‌ట్ట‌ణ ప‌రిస‌రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌ర‌మైన భూమి పుష్క‌లంగా ఉంద‌ని.. కానీ, జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌ని కోరారు.
 
హిందూపురం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం ప‌ట్ట‌ణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments