మహానాడు ప్రాంగణంలో హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడు ప్రాగణం వద్ద కారు పార్కింగ్ విషయంలో బాలకృష్ణ పోలీసులతో వారించారు. వీఐపీ పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేసి మహానాడు ప్రాంగణానికి వెళ్లాలని పోలీసులు సూచించారు.
అయితే బాలకృష్ణ వారి సూచనలను ఏ మాత్రం పట్టించుకోకుండా బాలకృష్ణ మహానాడు వేదిక మెయిన్ గేట్ వరకూ కారులోనే వెళ్లారు. తాను హిందూపురం ఎమ్మెల్యేనని, తననే ఆపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది.
అయితే ఆ తర్వాత బాలయ్య మాట్లాడుతూ.. అభిమానులు, కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండడం, తనకు రక్షణగా ఎక్కువ మంది లేకపోవడంతోనే కారును మెయిన్ గేటు వరకూ తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పానే తప్ప ఎవరినీ తిట్టలేదని అన్నారు.