Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ వైకాపా ఎమ్మెల్యే కన్నుమూత

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (08:30 IST)
కడప జిల్లాలోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పూర్తిచేసుకుని మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. 
 
అయితే మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో సుబ్బయ్యను కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆయన మృతి చెందారని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు. 
 
మరోవైపు వైసీపీ కార్యకర్తలు, ద్వితియశ్రేణి నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన సుబ్బయ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, ఎమ్మెల్యే మృతిపట్ల సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments