Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ చెంతకు బాబు.. మళ్లీ ఎన్డీయేలో చేరనున్న టీడీపీ!?

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (15:54 IST)
ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య మళ్లీ కొత్త స్నేహం చిగురించినట్టుగా కనిపిస్తుంది. దీంతో బీజేపీ సారథ్యంలోని ఏన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతున్నట్టు రిపబ్లికన్ టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అయితే, ఈ టీవీ బీజేపీకి అనుకూల ఛానెల్. దీంతో ఈ కథనం నిజమైవుండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అటు తెలంగాణాలో ఏకంగా 20 శాతం మేరకు ఓటు బ్యాంకును కలిగివుంది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలన్న సానుకూల ధోరణితో బీజేపీ అగ్రనేతలైన ప్రధాన మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఉన్నట్టు ఆ టీవీ కథనంలో పేర్కొంది. 
 
కాగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన "ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌"లో ప్రధాని మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరచాలం చేసారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఐదు నిమిషాల పాటు చర్చ జరిగింది. అలాగే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థికి టీడీపీ జై కొట్టింది. ఆగస్టు 15న టీడీపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బాబు... ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పరిణామాలన్నీ టీడీపీ - బీజేపీల మధ్య మళ్లీ చెలిమి చిగురించేలా చేశాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments