Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అరగంట కోసం కాదుగా సోంబేరి సారూ'... మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు విమర్శ

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (14:25 IST)
తండ్రిని అరెస్టు చేయగానే భార్యా, తల్లిని వదిలేసి లోకేశ్ ఢిల్లీకి పారిపోయాడంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా బంధించారు. 
 
అయితే, చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. అక్కడే కొద్ది రోజుల పాటు ఉన్నారు. అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుస్తూ కోర్టు వ్యవహారాలు చూసుకున్నారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 
 
తండ్రిని అరెస్టు చేస్తే భార్యాపిల్లలను వదిలి ఢిల్లీకి పారిపోయిన పిరికి బడుద్దాయి అని లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా అదే స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. "తండ్రి కోసమేగా వెళ్లింది.. అరగంట కోసం కాదుగా సోంబేరి సారూ" అంటూ కౌంటర్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments