Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు : సోషల్ మీడియాలో హైఅలెర్ట్... రెచ్చగొడితే ఎన్.ఎస్.సీనే

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (15:59 IST)
అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలుజారీచేసింది. కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అసత్య వార్తలను, రెచ్చగొట్టే ప్రకటనలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, జాతీయ భద్రతా చట్టం కింద కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 
 
ఇగే అంశంపై కర్నాటక డీజీపీ నీలవేణి ఎన్. రాజు స్పందిస్తూ, మరో పది రోజుల్లో దేశంలోనే కీలక అంశమైన అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 
 
రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్‌ మీడియాపై నిఘా ప్రారంభమైందని తెలిపారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్‌ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తామన్నారు. 
 
కేంద్ర ఇంటలిజెన్స్‌ సూచనలకు అనుగుణంగా సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు కొనసాగిస్తామన్నారు. ప్రజలు శాం తిని కాపాడే దిశగా వ్యవహరించాలని పోలీసులతో సహకరరించాలన్నారు. 
 
వదంతులను నమ్మరాదని బంధువులు మిత్రులతో ఏర్పా టు చేసుకున్న వాట్సప్‌ గ్రూపులలో దుష్ప్రచారాలకు అవకాశాలు ఇవ్వరాదన్నారు. అనవసరమైన పోస్టింగ్‌లు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments