Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు : సోషల్ మీడియాలో హైఅలెర్ట్... రెచ్చగొడితే ఎన్.ఎస్.సీనే

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (15:59 IST)
అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలుజారీచేసింది. కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అసత్య వార్తలను, రెచ్చగొట్టే ప్రకటనలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, జాతీయ భద్రతా చట్టం కింద కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 
 
ఇగే అంశంపై కర్నాటక డీజీపీ నీలవేణి ఎన్. రాజు స్పందిస్తూ, మరో పది రోజుల్లో దేశంలోనే కీలక అంశమైన అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 
 
రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్‌ మీడియాపై నిఘా ప్రారంభమైందని తెలిపారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్‌ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తామన్నారు. 
 
కేంద్ర ఇంటలిజెన్స్‌ సూచనలకు అనుగుణంగా సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు కొనసాగిస్తామన్నారు. ప్రజలు శాం తిని కాపాడే దిశగా వ్యవహరించాలని పోలీసులతో సహకరరించాలన్నారు. 
 
వదంతులను నమ్మరాదని బంధువులు మిత్రులతో ఏర్పా టు చేసుకున్న వాట్సప్‌ గ్రూపులలో దుష్ప్రచారాలకు అవకాశాలు ఇవ్వరాదన్నారు. అనవసరమైన పోస్టింగ్‌లు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments