నిజమైన నిందితులకు శిక్ష ఎక్కడ? సుప్రీంకోర్టుకు అయేషా మీరా తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (09:28 IST)
తమ కుమార్తె హత్య కేసులో నిజమైన నిందితులకు ఇప్పటివరకు శిక్ష పడలేదని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మృతురాలు అయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై విజయవాడలో "న్యాయంకై ఇంకెన్నాళ్లు'' అనే పేరుతో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ కుమార్తె హత్య కేసులో నిజమైన నిందితులను అరెస్టు చేయకపోగా మధ్యలో కొందరు అమాయకులను అరెస్టు చేసి అన్యాయంగా శిక్షించారని ఆరోపించారు. 
 
అయేషా హత్య కేసులో నిందితులకు శిక్షపడేదాకా పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. అసలైన దోషులకు శిక్షపడి న్యాయం జరిగే వరకు ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కేసును తప్పుదోవ పట్టించారని, 2018 డిసెంబరులో సీబీఐకు అప్పగించినప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్నారు. 
 
సీబీఐ దర్యాప్తులో భాగంగా తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ పరీక్షలు కూడా చేశారని, తమ దగ్గరున్న వివరాలన్నీ సీబీఐకు అప్పగించామన్నారు. తమ మత పెద్దలు అయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టానికి అంగీకరించకపోయినా నాడు కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్నామన్నారు. కానీ, రీపోస్టుమార్టం చేసిన నాలుగేళ్ళయినా ఇంతవరకు దానికి సంబంధించిన నివేదిక రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments