Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రస్థాయిలో నీటికొరత : హెలికాఫ్టర్లలో వెళ్లి ఒంటెలను చంపేస్తున్నారు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (17:29 IST)
ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీనికి కారణం ఒంటెలు అధికంగా నీళ్లు తాగేస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఒంటెలను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ దేశ అధికారులు హెలికాఫ్టర్లలో గాలిస్తూ కంటికి కనిపించిన ఒంటెను చంపేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే, కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. 
 
మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాపర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments