Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య రెండు నెలల గర్భిణి, ఆమంటే భర్తకు ప్రాణం, కానీ?

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (18:12 IST)
పెళ్ళయి 14 నెలలు. ఇప్పుడు రెండు నెలల గర్భిణి. కూతురు గర్భవతి అయ్యిందన్న విషయం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు సంతోషాన్ని మిగల్చలేదు. ఒక్కసారిగా ఆవిరైపోయాయి. అదనపు కట్నం వేధింపులు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అత్త వేధింపులు ఎక్కువవడంతో ఆ అభాగ్యురాలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
 
అనంతపురం జిల్లా యాడి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన బాబా ఫకృద్ధీన్‌కు కర్నూలుజిల్లా పత్తికొండ గ్రామానికి చెందిన రిజ్వానాతో 14 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో 15 తులాలకు పైగా బంగారం.. మూడులక్షల దాకా డబ్బులు ఇచ్చి వివాహం చేశారు. 
 
అయితే ముందు నుంచి అదనపు కట్నం కోసం ఫకృద్ధీన తల్లి రిజ్వానాను వేధిస్తూ ఉండేది. తనను తాను సముదాయించుకుంటూ ఎన్నోసార్లు తట్టుకుంది రిజ్వానా. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భవతి కూడా అయ్యింది. పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఆనందంలో ఉండేది రిజ్వానా.
 
అయితే బిడ్డ పుట్టేకన్నా ముందే నిన్ను మీ పుట్టింటికి పంపిచేస్తాను.. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకునే ఇంటికి రా అంటూ అత్త గొడవకు దిగింది. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పాటు తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం ఏమాత్రం ఇష్టం లేని రిజ్వానా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
 
భర్త ఉద్యోగానికి వెళ్ళడంతో పాటు అత్త షాపుకు వెళ్ళడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు గల కారణాలు లేఖ రాసి చనిపోయింది. రిజ్వానా చనిపోయిందని తెలుసుకున్న భర్త బోరున విలపిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం