దళిత యువకుడి శిరోముండనం వెనక ఉన్న ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేయాలి: నాదెండ్ల మనోహర్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (22:31 IST)
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో శ్రీ వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసి, చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ప్రజాస్వామ్యానికే తల ఒంపులు తీసుకువచ్చింది. బాధ్యత కలిగిన పోలీసులు ఈ విధమైన అనాగరిక చర్యలకు ఒడిగట్టడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికార పక్షం నాయకులు ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ పనులకు పాల్పడ్డారు.
 
పోలీస్ స్టేషన్ లోనే ఈ చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసే లారీలు ప్రమాదకరంగా మారాయని సీతానగరం ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీని నిలువరించిన దళితులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, ఓ యువకుడిని శిరోముండనం చేసి అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించాలి.
 
ఇసుక మాఫియాను అరికట్టకుండా, తమ ప్రాణాలను ఆ మాఫియా లారీల నుంచి కాపాడమన్నవారిని ఈ విధంగా హింసించడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోంది. ఈ కేసులో బాధ్యులుగా పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపోదు.
 
ఈ ఘటనకు పోలీసులను ప్రేరేపించిన అధికార పక్ష నాయకులను కూడా బాధ్యులను చేసి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు నమోదు చేయాలి అన్నారు. దళితులపై, దళిత ఉద్యోగులపై దాడులు పెరగడాన్ని, వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న తీరునీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అని మనోహర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments