Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి?.. మహిళకు ఎస్.ఐ వేధింపులు

పోకిరీల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ రక్షణ భటుడు కామాంధుడిగా మారిపోయాడు. ఓ మహిళను తన వికృత చేష్టలతో వేధించాడు. నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి? అంటూ వేళాపాళా లేకుండా పదేపదే ఫోన్లు చేసి వ

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (13:30 IST)
పోకిరీల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ రక్షణ భటుడు కామాంధుడిగా మారిపోయాడు. ఓ మహిళను తన వికృత చేష్టలతో వేధించాడు. నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి? అంటూ వేళాపాళా లేకుండా పదేపదే ఫోన్లు చేసి విసుగుతెప్పించాడు. చివరకు అతని వేధింపులు భరించలేని ఆ మహిళ.. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ కీచక ఎస్.ఐ బండారం బయటపడింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఓ సివిల్‌ కేసు నిమిత్తం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అప్పుడు ఎస్‌ఐ వివాదంలో ఉన్న ఇరువురితో మాట్లాడి పంపించేశారు. ఆ తర్వాత విచారణ పేరుతో ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకుని తరచూ అర్థరాత్రిళ్లు అభ్యంతరకరంగా మాట్లాడటం మొదలు పెట్టారు.
 
నిజానికి ఆ మహిళ బంధువులు గతంలో కల్తీసారా వ్యాపారం చేస్తుండేవారు. తరచూ తనిఖీలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం సారా విక్రయం మానుకుని కూలి పనులకు వెళ్తోంది. అయినా ఎస్‌ఐ అమె ఇంటికి చాలాసార్లు తనిఖీలకు వెళ్లేవారు. అసభ్యకరంగా మాట్లాడేవారు. 
 
తాజాగా ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఈ మహిళకు రాత్రిళ్లు ఫోన్‌చేసి నువ్వంటే నాకిష్టమని వేధించారు. ఆమె అంగీకరించకపోవడంతో సారా విక్రయిస్తున్నావా? అని బెదిరింపులకు దిగారు. ఎస్‌ఐ ఫోన్‌లో మాట్లాడినవన్నీ ఆమె రికార్డింగ్‌ చేసి ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ వెంటనే స్పందించి ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments