Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమిట్టకు సతీసమేతంగా వెళ్లాల్సి వస్తుందనే జగన్ కుంటిసాకు : అచ్చెన్నాయుడు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:52 IST)
కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో జరిగిన సీతారామ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరుకావాల్సివుంది. కానీ, కాలు బెణికుందని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పైపెచ్చు. గురువారం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, లింగంగుంట్లలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి సీఎం జగన్ హాయిగా పాల్గొన్నారు. దీన్ని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఆరోపించారు. 
 
సీఎం జగన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని స్పష్టంచేశారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. గురువారం పల్నాడు జిల్లాలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కళ్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా అని నిలదీశారు. ఇటీవల వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు బెణికిందంటూ ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి వెళ్లకుండా చిలకలూరిపేటకు ఎలా వెళతారని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments