Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య చైనాలోని రెస్టారెంట్‌ భారీ పేలుడు : ముగ్గురు మృతి

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (13:20 IST)
ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్‌లో గల రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్‌ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్‌ భవనం కుప్పకూలిపోయింది. 33 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాలను తొలగిస్తున్నారు. 
 
అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్‌ చేసిన వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. దీనితో పాటు సమీపంలో ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments