Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు రెండో షాక్... వ్యక్తిగత మినహాయింపుకు నో...

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు షాకిచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు పిటీషన్ కొట్టివేతతో సీఎం జగన్ న్యాయస్థానానికి హాజరవ్వాల్సి వుంటుంది.
 
గతంలో అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిలు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డితో పాటు.. విజయసాయిరెడ్డిపై పలు అక్రమాస్తుల కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో జగన్‌ ముఖ్యమంత్రి కాక మునుపు ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణకు సీఎం జగన్ మినహాయింపు కోరుతూ వచ్చారు. ఐతే సీబీఐ కోర్టు దానికి నో చెప్పడంతో ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇపుడు ఈడీ కోర్టు కూడా సీఎం హాజరు కావాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments