Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీత Vs రోజా: గతం గుర్తు చేసుకో.. అప్పుడు వైఎస్.. ఇప్పుడు బాబా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ మంత్రి పరిటాల సునీతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైసీపీ తరపున అవకాశం దొరికనపుడల్లా తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడే రోజాకు.. పరిటాల సునీత కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సభలో రోజా మాట్లాడుతూ దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంపై విమర్శలు గుప్పించారు. 
 
శ్రీరాం తన రాజకీయ ప్రత్యర్థులను హత్య చేస్తున్నారని ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన వారున్నారని ఆరోపించారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతోనే ఆ చర్యలు సాగుతున్నాయని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే పరిటాల రవి సతీమణి రాష్ట్ర మంత్రి అయిన పరిటాల సునీత మైక్ తీసుకొని రోజాపై విరుచుకుపడ్డారు.
 
రోజా తెలుగుదేశం పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో గుర్తుకుతెచ్చుకోవాలని సునీత చెప్పారు. టీడీపీ నాయకురాలిగా ఉన్నపుడు రాయలసీమలో పర్యటిస్తూ.. పరిటాల రవి బొమ్మకు దండవేసి నివాళులు అర్పించారని చెప్పారు. ఇదే క్రమంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డే పరిటాల రవిని చంపించారని ఆరోపించారని...ఆ విషయం ఇపుడు రోజా మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు.
 
టీడీపీలో ఉన్నపుడు ఒకమాట...ఇపుడు ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రోజా చేసే విమర్శల్లో వాస్తవం ఉంటే...ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు విశ్వసనీయత కాపాడుకునేలా మాట్లాడాలని సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments