Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో పంద్రాగ‌స్టు ఏర్పాట్లు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (13:05 IST)
భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రోటోకాల్ మొద‌లైంది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో పంద్రాగ‌స్టు నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆదివారం ఉదయం విజ‌య‌వాడ‌లోని పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్స్ లో ఏపీ సీఎం జెండా ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొంటారు. దీని కోసం డి.జి.పి, ఇత‌ర అత్యున్న‌త అధికారులు హాజ‌రై, బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం గ్రౌండ్స్ అంతా త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు.

ఉద‌యం 8గంట‌లకు అసెంబ్లీ భవనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆలాగే ఉ.8.15 గం.లకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

సచివాలయం మొదటి భవనం వద్ద ఉ.7.30 గం.లకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే, వివిధ జిల్లాల‌లో త్రివ‌ర్ణ ప‌తాకం ఎగుర‌వేయాల్సిన మంత్రుల లిస్ట్ కూడా ఇప్ప‌టికే జిల్లా కేంద్రాల‌కు వెళ్ళిపోయింది.

ఆయా మంత్రులు అక్క‌డ ముఖ్య అతిథులుగా హాజ‌రై, జాతీయ జెండాను ఆవిష్క‌రిస్తారు. క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments