Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు

కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (08:56 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశానని తెలిపారు. తన పోరాటం ఆగదని.. న్యాయం కోసం పోరాడితే తనపై ఎదురుదాడి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
 
ఆనాడు హైదరాబాదును డెవలప్ చేశానని.. ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సి వుందని చెప్పారు. ఓ పత్రిక తనను వెనక్కులాగే ప్రయత్నం చేస్తోందని, నిజానికి ఆ పత్రిక రాష్ట్రాన్నే వెనక్కు లాగుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తాను చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సీఎం చంద్రబాబునాయుడు, శుక్రవారం అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. 
 
వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్‌పై వెళ్లి బాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఎంపీల పోరాటాన్ని ఐదు కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments