Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు

కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (08:56 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశానని తెలిపారు. తన పోరాటం ఆగదని.. న్యాయం కోసం పోరాడితే తనపై ఎదురుదాడి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
 
ఆనాడు హైదరాబాదును డెవలప్ చేశానని.. ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సి వుందని చెప్పారు. ఓ పత్రిక తనను వెనక్కులాగే ప్రయత్నం చేస్తోందని, నిజానికి ఆ పత్రిక రాష్ట్రాన్నే వెనక్కు లాగుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తాను చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సీఎం చంద్రబాబునాయుడు, శుక్రవారం అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. 
 
వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్‌పై వెళ్లి బాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఎంపీల పోరాటాన్ని ఐదు కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments