Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

ఠాగూర్
శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:00 IST)
విజయవాడ మహనగరంలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవంతంగా పూడ్చివేశారు. భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో బుడమేరుకు వాగుకు మూడు చోట్ల గండ్లు పడిన విషయం తెల్సిందే. విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన జలవనరులల శాఖ అధికారులు బుడమేరు గుండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో రెండు గండ్లను పూడ్చిన అధికారులు.. అతిపెద్దదైన మూడో గండిని భారత ఆర్మీ సాయంతో పూడ్చివేశారు. ఈ గండ్లు పూడ్చివేత వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్వీట్టర్ హ్యాండిల్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. 
 
"బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తి. పెద్దదైన మూడో గండిని కూడా పూడ్చిన సిబ్బంది. 90 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చిన అధికారులు. మొత్తం 3 గండ్లు పూడ్చడంతో దిగువ ప్రాంతాలకు ఆగిన వరద. 5 రోజులుగా నిరంతరాయంగా కొనసాగిన పనులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో, అక్కడే ఉండి పనులు పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎప్పటికప్పుడు మంత్రి నిమ్మలతో సమన్వయం చేసుకుంటూ, కావాల్సిన వర్కర్లు, సామాగ్రిని సరఫరా చేస్తూ సహకారం అందించిన మంత్రి లోకేష్. మూడో గండి పూడ్చివేతలో సహకరించిన ఆర్మీ" అంటూ పేర్కొంది 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments