Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును కలిసిన తర్వాత వేధింపులు : కొత్తపల్లి గీత!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత తనకు వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని అరకు వైకాపా ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును తాను అరకు సమస్యలపై కలిసిన మాట్లానట్టు చెప్పారు. అయితే, ఈ సమావేశం తర్వాత తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఫోన్ ఇంకెవరైనా ఎత్తితే మౌనమే సమాధానం అవుతోందని చెప్పారు. 
 
అదేవిధంగా ఫేస్‌బుక్ ఖాతాలో కూడా అసభ్యకరమైన సందేశాలు పోస్టు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే ఎంపీపై ఈ రకమైన మానసిక దాడి చేయాల్సిన అసవరం ఎవరికి ఉంటుందంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
 
వైఎస్సార్సీపీ నుంచి ఎవరైన బయటకు వస్తే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన దాడిని నేతలే చేయిస్తున్నారా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు చేయిస్తున్నారా? లేదా ఇంకెవరైనా ఆకతాయిలు ఈ పనికి పూనుకున్నారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments