Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించిన ఏపీ ప్ర‌భుత్వం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (14:00 IST)
అస‌మాన సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇతోధికంగా సాయ‌ప‌డింది. సిరివెన్నెల చికిత్స కోసం అయిన‌ ఆసుపత్రి ఖర్చులను  కిమ్స్ ఆసుప‌త్రి  యాజమాన్యానికి ఏపి ప్రభుత్వం చెల్లించింది.


సిరివెన్నెల ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న చేరిన నాలుగైదు రోజుల‌కు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయ‌న చికిత్స‌కు అయిన ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. అంతే కాదు, అంత వ‌ర‌కు అంత వ‌ర‌కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ స‌భ్యులు,  ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని కూడా సిరివెన్నెల కుటుంబానికి తిరిగి  ఇవ్వాలని ఆసుపత్రికి  ఏపి ప్రభుత్వం తెలిపింది. 
 
 
సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నివాళి అర్పించింది. ప్ర‌భుత్వం త‌రఫున ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ కి వెళ్ళి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళులు అర్పించారు. ఆయ‌న భార్య‌ను, బంధువుల‌ను ఓదార్చారు. వారి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ధైర్యం చెప్పారు. అక్క‌డే మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున నివాళులు తెలిపారు. ఇలా మాట‌ల‌తోనే గ‌డ‌ప‌కుండా, ఆయ‌న కుటుంబానికి మేలు క‌లిగేలా, ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించి అండ‌గా నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments