మా విధుల్లో సర్కారు జోక్యం ... సీఐడీ కేసులు పెట్టి వేధింపులు : నిమ్మగడ్డ

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. ముఖ్యంగా, ఎన్నికల సంఘం స్వతంత్రతను పూర్తిగా అణిచివేసేలా వ్యవహరిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ఏపీ ప్రభుత్వం తమ విధుల్లో జోక్యం చెసుకుంటోందని, తమ సిబ్బందిని కేసులు పెట్టి వేధిస్తోందంటూ ఆరోపించారు. ఈ కేసులన్నీ కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాలన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. 
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సీఐడీ అధికారులు ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్‌ను, అందులోని డేటాను తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నిటినీ తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. 
 
గతంలో తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు తమ కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు.. ఆ విషయాన్ని పక్కనబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకే ఆసక్తి ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, పని చేయని కంప్యూటర్‌ను ఫార్మాట్‌ చేసినందుకు సాంబమూర్తిని సీఐడీ అధికారులు వేధించడమేగాక.. సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ ఆయనపై తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. కమిషన్‌ను, ఉద్యోగులను వేధించేందుకే ఆ కేసు పెట్టారని, ఈ కేసును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
 
కాగా, సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్లను కలిపి విచారించేలా తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments