Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చేయలేడు, జనసేనానికి అదేంటో తెలియదు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:28 IST)
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి శంకర్ నారాయణ. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్న మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం చంద్రబాబునాయుడిది. పార్టీ పెట్టాడు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థితో పాటు సమస్యలపై అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. వీరు కూడా వైసిపి ప్రభుత్వాన్ని విమర్సించడమా. హాస్యస్పదంగా ఉందన్నారు మంత్రి శంకర్ నారాయణ.
 
ఎపిలో కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగబోతోందని.. ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని.. అందుకే 2,205కోట్ల రూపాయలను టెండర్లు పిలిచామని.. త్వరలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్ల రూపురేఖలే మార్చేస్తామన్నారు. 
 
రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ ఏం తెలుసునని.. కనీస అవగాహన ఎందులోను లేని వ్యక్తి జనసేనాని అంటూ మండిపడ్డారు. ఇక చంద్రబాబు తన హయాంలో రోడ్ల గురించి అస్సలు పట్టించుకోలేదన్నారు. రోడ్ల పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంటే టిడిపి హయాంలో పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments