Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్నా చేసిన విద్యార్థులపై అత్యాచారం కేసు... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (10:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అడ్డదిడ్డంగా సాగుతోందని చెప్పేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణ. ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షినే.. ధర్నా చేసిన విద్యార్థులపై అత్యాచారం కేసు నమోదు చేయడం గమనార్హం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ వింత కసు నమోదైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలీస్తే, తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థి నేతలు యత్నించారు. అయితే, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థులు పోలీసుల కళ్లుగప్పిలోనికి ప్రవేశించారు. సీఎం ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉండగానే పోలీసులు ఐదుగురికి అదుపులోకి తీసుకున్నారు. 
 
వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, రిమాండ్ రిపోర్ట్ చూసిన జడ్జి షాక్ అయ్యాడు. ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్ధులపై అత్యాచారం కింద కేసు నమోదు చేయడం ఏంటని జడ్జి మండిపడ్డారు. 
 
దీంతో షాకైన పోలీసులు, పాత మ్యాటర్‌ను ఎడిట్ చేసిన సమయంలో పొరపాటు జరిగిందని పోలీసులు వాటిని సరిచేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అంటే.. ఏపీలో పోలీసుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments