ముఖ్యమంత్రిగానే మ‌ళ్ళీ అసెంబ్లీ కి వస్తా... చంద్రబాబు కంట త‌డి!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (12:57 IST)
ఇది గౌర‌వ స‌భా... కౌర‌వ స‌భా... వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి దూషిస్తారా?  చివ‌రికి కుటుంబ స‌భ్యుల‌పైనా దూష‌న‌లు చేస్తారా అంటూ, ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. చంద్రబాబు సతీమణిని వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శలు చేసిన వైసీపీ సభ్యుల‌పై ఆయ‌న అస‌హ‌నంగా స్పందించారు. మళ్ళీ గెలిచిన తర్వాతే శాస‌న సభకు వస్తా అంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. 

 
అంత‌కు ముందు అత్యవసర టీడీఎల్పీ సమావేశంలో చంద్ర‌బాబు కంట తడిపెట్టారు. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయటంపై చంద్రబాబు ఆవేదన వ్య‌క్తం చేశారు. తాను మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతాన‌ని, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ కి వస్తాన‌ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ‌ప‌థం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ఘాంత‌పోయారు. 

 
చంద్ర‌బాబు చేసిన లుచ్చా ప‌నులు అని మంత్రి కొడాలి నాని మాట్లాడ‌ట‌మే ఆయ‌న‌ను తొలుత మ‌న‌సుకు బాధ క‌లిగించింది. దీనికి తోడు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపైనా ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు వ్య‌క్తిగ‌తంగా కామెంట్స్ చేయ‌డంతో ఆయ‌న పూర్తిగా చ‌లించిపోయారు. మళ్ళీ గెలిచిన తర్వాతే సభ కు వస్తా అని చంద్రబాబు సవాల్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments