Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... కోడ్ దెబ్బకు 'కరివేపాకు'లా మారిన మంత్రి

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (20:28 IST)
ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి. ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 23 రోజులు ఆగాలి. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలనుకున్నారు వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంత్రిగారు సచివాలయానికి వచ్చి అధికారులకు కబురు పంపినా ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... ఎవ్వరూ సోమిరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. 
 
ఉదయం 11 గంటలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకూ అలాగే ఎదురుచూపులు చూశారు. అధికారులు ఎవరయినా వస్తే వారితో సమీక్ష చేద్దామని. మంత్రిగారు కబురు పంపిన నేపధ్యంలో సంబంధిత అధికారులు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించారట. ఎన్నికల కోడ్ అమల్లో వున్నది కనుక సమీక్షలకి నో ఛాన్స్ అనేసరికి వారు కాస్తా సైలెంట్ అయిపోయారట.
 
ప్రజలు అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే వాటిపై చర్చించడానికి అధికారులు ఎందుకు రారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిందులు తొక్కారట. ఐనప్పటికీ కోడ్ దెబ్బకు అధికారులు ఎవ్వరూ రాలేదు మరి. ఈ పరిస్థితి అంతా చూసినవారు... కోడ్ దెబ్బకు మంత్రిగారిని కరివేపాకులా తీసిపారేశారే అని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments