Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... కోడ్ దెబ్బకు 'కరివేపాకు'లా మారిన మంత్రి

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (20:28 IST)
ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి. ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 23 రోజులు ఆగాలి. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలనుకున్నారు వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంత్రిగారు సచివాలయానికి వచ్చి అధికారులకు కబురు పంపినా ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... ఎవ్వరూ సోమిరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. 
 
ఉదయం 11 గంటలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకూ అలాగే ఎదురుచూపులు చూశారు. అధికారులు ఎవరయినా వస్తే వారితో సమీక్ష చేద్దామని. మంత్రిగారు కబురు పంపిన నేపధ్యంలో సంబంధిత అధికారులు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించారట. ఎన్నికల కోడ్ అమల్లో వున్నది కనుక సమీక్షలకి నో ఛాన్స్ అనేసరికి వారు కాస్తా సైలెంట్ అయిపోయారట.
 
ప్రజలు అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే వాటిపై చర్చించడానికి అధికారులు ఎందుకు రారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిందులు తొక్కారట. ఐనప్పటికీ కోడ్ దెబ్బకు అధికారులు ఎవ్వరూ రాలేదు మరి. ఈ పరిస్థితి అంతా చూసినవారు... కోడ్ దెబ్బకు మంత్రిగారిని కరివేపాకులా తీసిపారేశారే అని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments