Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం మంత్రి అయితే కోర్టుకు రారటనా.. అయితే అరెస్టు చేసి తీసుకురండి: కోర్టు ఆదేశం

ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎన్నికల కేసు విచారణకు గైర్హాజరు కావడంతో తీవ్రంగా మందలించడమే కాకుండా, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేస

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (10:17 IST)
ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎన్నికల కేసు విచారణకు గైర్హాజరు కావడంతో తీవ్రంగా మందలించడమే కాకుండా, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంటే.. మంత్రి గంటాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత 2009లో జరిగిన సాధారణ ఎన్నికలో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అదే సంవత్సరం ఏప్రిల్‌ 4న పట్టణంలోని ఆయన కార్యాలయంలో క్రికెట్‌ కిట్లు, చీరలు దొరికాయి. వీటికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
దీనిపై అనకాపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. వాయిదాలకు మంత్రి హాజరు కాకపోవడంతో రెండో అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి జె.వి.వి.ఎన్‌.సత్యనారాయణ మూర్తి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. వచ్చేనెల 11న విచారణకు హాజరవ్వాలని వారెంట్‌లో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments