Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.120 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన ఏపీ ఎన్జీవో

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఏపీ ఎన్జీవో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించింది. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకుని రూ.120 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో నేతలను అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 
మరోవైపు, విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పోటు పెరుగుతుంది. మంగళవారం బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఇది బుధవారానికి మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 8 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరిందని, ఇప్పటికీ ఒక గండి పూడ్చినట్టు తెలిపారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయని, ఈ పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని  తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments