Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.120 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన ఏపీ ఎన్జీవో

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఏపీ ఎన్జీవో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించింది. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకుని రూ.120 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో నేతలను అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 
మరోవైపు, విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పోటు పెరుగుతుంది. మంగళవారం బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఇది బుధవారానికి మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 8 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరిందని, ఇప్పటికీ ఒక గండి పూడ్చినట్టు తెలిపారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయని, ఈ పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని  తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments