Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ చర్చలకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడుగుతాం

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (17:16 IST)
పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో తాము ఆశించినట్టుగా లేదని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడుగుతామని, తమను మళ్లీ చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

 
మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోందన్నారు. అయితే ప్రతి మీటింగ్‌లోనూ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

 
ఈ జీవోపై ఉద్యోగులందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ జీవో ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉందని, ఈ జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.


తమ సమస్యలను సీఎంవో దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రభుత్వం స్పందన చూసి.. ఇవాళ సాయంత్రం ఉద్యోగులతో సమావేశం నిర్వహించి నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments