Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా.. ఏమి వినయం : వైవీఎస్ ముందు మోకరిల్లిన ఏపీ మంత్రి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతున్నట్టు లేదు. అధికార పార్టీ నేతలకు ప్రజలు మోకరిల్లాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పదవులు దక్కినవారు మాత్రం వైకాపా పెద్దల వద్ద మోకరిల్లుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మోకారిల్లారు. వైవీఎస్ కాళ్ళ వద్ద తాను ఒక రాష్ట్ర మంత్రిననే విషయాన్ని విస్మరించి మోకరిల్లారు. 
 
కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ జరిగింది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి అనేక మంది వైకాపా నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. వేదికపై వైఎస్ఎస్‌తో పాటు అనేక వైకాపా నేతలు ఆశీనులైవున్నారు. ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వేదికపైకి రాగానే వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ, చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌కు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని వ్యాఖ్యానించారు. అయితే, ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఓ వ్యక్తి వద్ద మోకరిల్లడం ఇపుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments