Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంక్షల మధ్య వినాయక చవితి పండుగ జరుపుకోండి... ఏపీ మంత్రి వెల్లంపల్లి

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షల మధ్య వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. పైగా, వినాయక చవితి చేసుకోకూడదని ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? నిలదీశారు. ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా..? పెద్దఎత్తున వేడుకలు జరగకుండా, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. కేంద్ర హోం శాఖ ఆగస్టు 28న ఇచ్చిన గైడ్ లైన్సును అనుసరించి పండుగ జరుపుకోవాలనే చెప్పామని వివరించారు.
 
అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి కావడం వల్లే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి వెల్లంపల్లి కొట్టిపారేశారు. 
 
పండుగలకు కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభించాలని కోరుకుంటున్నారా ? మండిపడ్డారు.
 
వినాయక చవితి అందరి పండుగ అన్న మంత్రి.. ఇళ్ళల్లో, దేవాలయాల్లోనూ చేసుకోవచ్చన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెట్టి, ఊరేగింపులు, భారీ ఎత్తున వేలు, లక్షల మందితో ఊరేగింపులు, హంగామాలు, ఆర్భాటాలు చేయడం వద్దని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments