Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి...

వరుణ్
బుధవారం, 19 జూన్ 2024 (15:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆయనకు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా ఫోన్ చేసి ప్రొటెం స్పీకరుగా వ్యవహించాలని గోరంట్లను కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకరుగా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 
 
ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, స్పీకర్ పదవికి టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసిన విషయం తెల్సిందే. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments