Webdunia - Bharat's app for daily news and videos

Install App

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (10:51 IST)
వైకాపా ప్రభుత్వంలో అధికార నేతల అండదండలతో రెచ్చిపోయి, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోమారు స్పష్టం చేశారు. ఇందులోభాగంగా, రెడ్ బుక్‌లోని మూడో చాప్టర్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలోని అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు.. త్వరలోనే రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌ కూడా తెరుస్తాం. యువగళం పాదయాత్రలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రెడ్‌బుక్‌కు భయపడుతున్న జగన్‌.. గుడ్‌బుక్‌ తీసుకొస్తానంటున్నారు. బుక్‌లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావట్లేదు. గతంలో సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్‌ నోటీసులు ఇచ్చేవారు. నోటీసులకు భయపడకుండా ఎన్‌ఆర్‌ఐలు నిలబడ్డారు.
 
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకెళ్లాలి. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్‌ చూపించారు. ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటాం. మీరు ఎన్‌ఆర్‌ఐలు కాదు.. ఎంఆర్‌ఐలు అని పిలుస్తా. ఎంఆర్‌ఐ అంటే ‘మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్‌’ అని అర్థం. ఏపీలో కూటమి గెలుపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారిది' అని లోకేశ్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments