Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో నారా లోకేశ్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ (Video)

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (11:08 IST)
ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ అపుడే కార్యరంగంలోకి దిగిపోయారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. ఇందుకోసం ఆయన మంగళగిరిలోని తన నివాసంలో శనివారం ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూనే వారి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 
 
నిజానికి తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 
 
నారా లోకేశ్‌ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
ఇదిలావుంటే, టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు అధినేత చంద్రబాబు శనివారం రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి రానున్నారు. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యాలయ వర్గాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఇకపై తరచూ పార్టీ కార్యలయానికి వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ చేశారు. పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments