Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (17:15 IST)
కొత్త రేషన్ కార్డులపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేవైసీ నమోదు పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టిపెడతామన్నారు. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఈ కోర్డులోనే ఉంటాయని, రేషన్ కార్డు అనికాకుండా ఫ్యామిలీ కార్డుగా అది ఉంటుందన్నారు. ఏటీఎం కార్డు తరహాలోనే స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తామని వెల్లడించారు. 
 
రైతులకు భరోసా కల్పించేలా 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఏ మిల్లుకు కావాలంటే ఆ మిల్లుకు ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కంటే 20 శాతం తేమ అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చామన్నారు. 
 
బియ్యం అక్రమ రవాణాలో 65 వేల టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వెహికల్స్ సీజ్ చెయ్యమని కూడా చెప్పామని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎప్పటికపుడు తనిఖీలు జరుగుతున్నాయన్నారు. దీపం పథకం గత దీపావళి రోజు ప్రారంభమైందన్నారు. దీపం పథకం మొదటి దశలో 99 లక్షలకు మంది లబ్దిదారులు లబ్ధి పొందారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments