Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్లండి.. టీ ఇచ్చి కుర్చీవేసి పని చేసిపెడతారు.. మంత్రి అచ్చెన్నాయుడు

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో వెళ్లాలని, అపుడు అధికారులో మీకు టీలు ఇచ్చి, కుర్చీలు వేసిమరీ పనలు చేసిపెడతారంటూ సూచించారు. పైగా, తాను చెప్పినట్టు అధికారులు వినకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పను, చేతల్లో చూపిస్తాను అని పరోక్షంగా అధికారులను సైతం హెచ్చరించారు. 
 
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అధికారులు, పోలీసులు నానా రకాలుగా వేధించారు. వారికి నరకం చూపించారు. వైకాపా నేతల దాడిలో గాయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితులపైనే కేసులు పెట్టారు. పోలీసులు అయితే మరింతగా చెలరేగిపోయారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకున్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి, వారిపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇపుడు అధికారం మారిపోయింది. వైకాపా స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments