Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి జోగి రమేష్‌కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!!

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:21 IST)
వైకాపా నేత, మంత్రి జోగి రమేష్‌కు ఆయన సొంత కుటుంబ సభ్యులు తేరుకోలేని షాకిచ్చిచారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఆయన బంధువులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమైవున్నారు. గురువారం నుంచి నామినేషన్లు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మంత్రి జోగి రమేష్‍‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సాక్షాత్తూ సొంత బామ్మర్దులు, బంధువులు వైకాపాకు టాటా చెప్పేశారు. వారు సైకిల్ ఎక్కేశారు. 
 
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి జోగి రమేష్‌కు షాకిస్తూ, ఆయన సొంత బామ్మర్దులు పామర్తి దుర్గా ప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వర రావులు టీడీపీ చేరారు. వీరితో పాటు జోగి రమేశ్‌‍కు చెందిన 40 మంది బంధువర్గం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ముందు సభా వేదికను ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరారు. అయితే, ఈ అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments