Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి దెయ్యాల రాజధాని.. సెలవిచ్చిన ఏపీ వైకాపా మంత్రి

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:18 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వైకాపా నేతలు తమ నోటికొచ్చినట్టు సంభోదిస్తున్నారు. గతంలో ఈ అమరావతిని శ్మశాన వాటికతో పోల్చారు. అలాంటి చోట మనుషులు నివసించలేరంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యాఖ్యానించారు. ఇపుడు మరో ఏపీ మంత్రి అమరావతిని దెయ్యాల రాజధానిగా అభివర్ణించి తన నోటి దూలను తీర్చుకున్నారు. పైగా, మూడు రాజధానులపై కొత్త బిల్లును తీసుకొచ్చి ముందుకెళ్లాతమని స్పష్టం చేశారు. ఆ మంత్రి పేరు గుడివాడ అమర్నాథ్. రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి. ఆయన తాజాగా మాట్లాడుతూ, అమరావతి దేవతల రాజధాని కాదన్నారు. అది ఒక దెయ్యాల రాజధాని అని వ్యాఖ్యానించారు. 
 
ఈ నెల 12వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు మహా పాదయాత్రను చేపట్టనున్నారు. దీనికి ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు. కానీ, వైకాపా మంత్రి అమర్నాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఇది వరకు ప్రతిపాదించిన బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కొత్త బిల్లును తీసుకునిరానున్నట్టు తెలిపారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. గాడిదకు కొమ్ములు వచ్చినా.. ముసలోడికి పిచ్చి వచ్చినా భరించడం కష్టమన్నారు. ఇపుడు చంద్రబాబు వ్యాఖ్యలు అదే తరహాలో ఉన్నాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments