Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు - అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి : మంత్రి దాడిశెట్టి రాజా

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (08:53 IST)
తమ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయంలో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వీరిలో ఒక్క గెలిచినా మేం వికేంద్రీకరణపై మాట్లాడబోమన్నారు. లేకుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి. వీరిలో ఏ ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణను ప్రజలు కోరుకోవట్లేదని మేం భావిస్తామన్నారు. 
 
ఆయన కాకినాడ జిల్లా తునిలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వికేంద్రీకరణ కోరుకుంటున్నారని, వారి మనోభావాలకు అనుగుణంగా ఈ నెల 15న విశాఖలో గర్జన తలపెట్టామన్నారు. అయితే, అదే రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యాత్రను తలపెట్టారన్నారు. ఇది కేవలం తాము తలపెట్టిన గర్జన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేనని ఆయన విమర్శించారు. 
 
'ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మేం కార్యక్రమాలు చేస్తుంటే ఎంత అహంభావం... ఎవరి కోసం గర్జన అని పవన్‌ అంటారా? 5 కోట్ల మంది ప్రజలకు అభిప్రాయాలు చెప్పే హక్కు లేదా?' అని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments