Webdunia - Bharat's app for daily news and videos

Install App

డా॥ సి నారాయణరెడ్డి మృతికి మంత్రి అఖిలప్రియ సంతాపం

అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, తెలుగుభాష, సాంస్కృతిక శాఖల మంత్రి భూమా అఖిలప్రియ సంతాపం వ్యక్తం చేశారు. సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (15:33 IST)
అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, తెలుగుభాష, సాంస్కృతిక శాఖల మంత్రి భూమా అఖిలప్రియ సంతాపం వ్యక్తం చేశారు. సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
ఇలాంటి సమయంలో వారి కుటుంబసభ్యులకు మనోనిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని మంత్రి కొనియాడారు. అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగా ఆయన ఎనలేని కృషిచేశారన్నారు. 
 
సినారె మరణం సాహితీ రంగానికి తీరని లోటని మంత్రి అఖిలప్రియ తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు చరిత్రలో మిగిలిపోతాయన్నాని మంత్రి అఖిలప్రియ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments