Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో 'పుర పోరు' వాయిదా... ఎస్ఈసీ ప్రకటన

Webdunia
బుధవారం, 6 మే 2020 (18:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక సంస్థలకు నిర్వహించతలపెట్టిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసే చర్యల్లో భాగంగా, ప్రసుత్తం లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలను మరికొంతకాలం వాయిదావేస్తున్నట్టు ఎస్ఈసీ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
పైగా, తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీ స్థానిక అధికారులను కోరింది. కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, లాక్‌డౌన్, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో  పేర్కొంది. 
 
రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఈ గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ బుధవారం సమీక్షించారు.
 
నిజానికి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న సమయంలోనే ఈ ఎన్నికలను అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదావేశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మగడ్డనా... లేక నేనా అంటూ మీడియా సమావేశం పెట్టిమరీ విమర్శించారు. 
 
ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేశారన్న నెపంతో రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదించి.. ఆ పదవి నుంచి దొడ్డిదారిన జగన్ సర్కారు తప్పించింది. ఈ వ్యవహారం ఇపుడు హైకోర్టులో నడుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments