Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (15:36 IST)
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఏడుగురు నిందితులకు అవినీతి నిరోధక శాఖ కోర్టు (ఏసీబీ కోర్టు) షాకిచ్చింది. ఈ నిందితులందరికీ రిమాండ్‌ను పొడగించింది. నిందితుల ప్రస్తుత గడువు మంగళవారంతో ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి జూన్ మూడో తేదీ వరకు రిమాండ్ పొడగించింది. 
 
ఈ కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను సిట్ అధికారులు మంగళవారం ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తును పురోగతిని తమకు తెలియజేయడం లేదని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీనిపై స్పందించిన కోర్టు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ క్రమలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమితి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తి మేరకు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మానవతా దృక్పథంతో అరంగట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments