Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (15:36 IST)
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఏడుగురు నిందితులకు అవినీతి నిరోధక శాఖ కోర్టు (ఏసీబీ కోర్టు) షాకిచ్చింది. ఈ నిందితులందరికీ రిమాండ్‌ను పొడగించింది. నిందితుల ప్రస్తుత గడువు మంగళవారంతో ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి జూన్ మూడో తేదీ వరకు రిమాండ్ పొడగించింది. 
 
ఈ కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను సిట్ అధికారులు మంగళవారం ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తును పురోగతిని తమకు తెలియజేయడం లేదని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీనిపై స్పందించిన కోర్టు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ క్రమలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమితి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తి మేరకు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మానవతా దృక్పథంతో అరంగట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments