Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల గజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తోంది...

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:54 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌నికిమాలిన రాజ‌కీయాలు చేసే టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేద‌ని రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ విమ‌ర్శించారు. నెల్లూరులో టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 
2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు సోష‌ల్ మీడియాలో ల్ట్రోల్ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు. 
 
 
పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయడం లేదని,  అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్‌ చేయాలని సవాల్‌ విసిరారు. టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలు జనం నమ్మరని స్పష్టం చేశారు. కుల గజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తోందని రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments